10 April, 2026 | 5:42 PM

Breaking News

జిల్లాలో ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమం పకడ్భందిగా నిర్వహించాలి   •   బంధాన్ని... బాధ్యతను మరచిన ఓ తల్లి   •   తంగళ్ళపల్లిలో ఘనంగా ప్రారంభమైన కేసీఆర్ క్రికెట్ కప్ 2026 క్రీడా పోటీలు   •   రాష్ట్ర కో కన్వీనర్ గా బద్రి శీను   •   ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి   •   గల్ఫ్ బాధితుల కోసం అడ్వైజరీ కమిటీ ఏర్పాటు   •   సంపూర్ణ ఆరోగ్యం యోగతోనే సాధ్యం - జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి   •   చేనేత కార్మికుల ఆత్మగౌరవానికి అండగా నిలుస్తాం   •   శ్రీ భక్తంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు   •   రాజ్యసభ సభ్యుడిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం   •  

జనవరి 28 నుంచి 31 వరకు మేడారం జాతర

03-07-2025 01:07 AM

పూజారుల సంఘం ప్రకటన

హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం మహా జాతరను 2026 జనవరి 28 నుంచి 31 తేదీ వరకు నిర్వహించను న్నారు. ఈ మేరకు బుధవారం పూజారుల సంఘం అధికారికంగా ప్రకటించింది. జనవరి 28న సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలకు వస్తారు. 29న సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి గద్దెలకు చేరుకుంటుంది.

30న భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. 31న సాయంత్రం 6 గంటలకు అమ్మవార్ల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది. జాతర తేదీల ప్రకటనపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. పూజారుల సంఘానికి ధన్యవాదాలు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించారు.

మేడారం జాతరకు సంబంధించిన పనుల్లో వేగం పెంచాలని అధికారులను మంత్రి ఆదేశించా రు. రూ.110 కోట్లతో మేడారంలో అభివృద్ధి పను లు కొనసాగుతున్నట్టు పేర్కొన్నారు. మేడారం జాతర ఏర్పాట్లను మంత్రి సీతక్క పర్యవేక్షిస్తున్నా రు. కలెక్టర్, అధికార యంత్రాంగంతో సమీక్షలు నిర్వహిస్తూ పనులను పరుగులు పెట్టిస్తున్నారు.