03-07-2025 01:07:58 AM
ఎమ్మెల్యే డా.హరీష్బాబు
కాగజ్నగర్, జూలై 2(విజయ క్రాంతి): నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని ఎమ్మె ల్యే పాల్వాయి హరీష్బాబు అన్నారు. మండలంలోని బలగలలో గల మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల2లో బుధవారం విద్యార్థులతో కలిసి హరీష్బాబు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు విద్యార్థులు నడుం బిగించాలని కోరారు.
మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలకు వెళ్లే రోడ్డు మార్గం బాగాలేదని ప్రిన్సిపల్ తెలియజేయడంతో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీ ఓ కోట ప్రసాద్, ఆర్ఎల్సి పుష్పలత, డిఎండబ్లు నదీమ్, ప్రిన్సిపల్ షగుఫ్తా, పంచాయ తీ కార్యదర్శి హరీష్ పాల్గొన్నారు.