1 September, 2026 | 10:15 PM

Breaking News

భూ రీ సర్వేను నిలిపివేయాలని గ్రామస్తుల ధర్నా   •   ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి   •   అశ్వాపురం రైస్‌మిల్‌ యజమాని అరెస్ట్‌   •   రేషన్ షాపుల ద్వారా బియ్యంతో పాటు చక్కెర కిరోసిన్ పంపిణీ చేయాలి   •   కార్పొరేట్ శక్తులకు పట్టం కడుతుం కేంద్ర ప్రభుత్వం   •   22ఏ భూముల వివరాలు పక్కాగా సిద్ధం చేయాలి   •   సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలి   •   ఓపీఎస్‌ కోసం ఉద్యోగుల గళం.. నల్ల బ్యాడ్జీలతో నిరసన   •   కరీంనగర్ జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా నల్లగొండ తిరుపతి గౌడ్ నియామకం   •   ఉద్యోగులకు పాత పెన్షన్ విదానాన్ని అమలు చేయాలి   •  

డిస్పెన్సరీల్లో మెడిసిన్ అందుబాటులో ఉంచాలి

23-05-2025 | 12:00am

సింగరేణివ్యాప్తంగా సుమారు 40,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అలాగే సుమారు 82,387 మంది విశ్రాంత ఉద్యోగులు ఉన్నారు. వీరిలో ఎంతోమంది సింగరేణి గనుల ప్రభావిత ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. వీరిలో కొందరు సింగరేణి యాజమాన్యం నిర్వహిస్తున్న ఆసుపత్రుల్లోనే ఔట్ పేషేంట్ చికిత్స తీసుకుంటున్నారు. దీర్ఘకాలిక వ్యాధులకు నెలనెలా మెడిసిన్ సైతం తీసుకుంటున్నారు.

వీరిలో బీపీ, షుగర్, గుండె, మోకాళ్ల సంబంధమైన వ్యాధులతో బాధపడేవారే ఎక్కువ. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం వంటి నగరాలు, పట్టణాల్లో పిల్లలపై ఆధారపడే వారు ప్రతి నెలా సింగరేణి డిస్పెన్సరీలకు వెళ్లి మెడిసిన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా డిస్పెన్సరీలకు వెళ్లిన వారికి అక్కడ పూర్తిస్థాయిలో మెడిసన్ లభించడం లేదు. వాటిల్లో మెడిసిన్ కొరత సమస్య ఉంది.

ఒక్కోసారి నెల మధ్యలనే విశ్రాంత ఉద్యోగులు ఆసుపత్రులకు రావాల్సి వస్తున్నది. వయోభారాన్ని మోస్తున్న విశ్రాంత ఉద్యోగులు అన్ని సార్లు డిస్పెన్సరీలకు వెళ్లడం ఆరోగ్యరీత్యా మంచిదికాదు. కాబట్టి సింగరేణి యాజమాన్యం సంస్థ ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి. విశ్రాంత ఉద్యోగులకు అవసరమైన మెడిసిన్‌ను ఎప్పటికప్పుడు సమకూర్చేందుకు చర్యలు తీసుకోవాలి.

 ఆళవందార్ వేణు మాధవ్, హైదరాబాద్