15 April, 2026 | 1:18 PM

Breaking News

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •  

సత్య సాయిబాబా ఆధ్వర్యంలో మెగా వైద్యశిబిరం

22-12-2025 12:00 AM

జహీరాబాద్, డిసెంబర్ 21: మానవసేవయే మాధవ సేవ అని శ్రీ సత్య సాయిబాబా ట్రస్ట్ పేర్కొంది. శ్రీ సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం మండలం కుప్పానగర్ గ్రామంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఉదయం నగర సంకీర్తనతో ప్రారంభమైన కార్యక్రమాలు పశువైద్య శిబిరం, అక్షరాభ్యాసం, మెగా వైద్య శిబిరం, ఉచిత మందుల పంపిణీతో పాటు బీదలకు నెలకు సరిపడే నిత్యవసర సరుకులను అందజేశారు.

దీంతోపాటు వృద్ధులైన భార్యాభర్తలకు శత జయంతి ఉత్సవాన్ని జరిపి వారికి మళ్ళీ నూతనంగా వివాహం జరిగినట్లు పూలదండలను మార్పించారు. వృద్ధులకు చేతి కర్రలను, పాఠశాల విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లను, బీద బడుగు బలహీన వర్గాల వారికి దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్య సాయిబాబా జహీరాబాద్ సభ్యులు పాల్గొన్నారు. ఈ శిబిరంలో జహీరాబాద్ కు చెందిన నీలం హాస్పిటల్ డాక్టర్లు స్వచ్ఛందంగా వివిధ రుగ్మతలు కలిగిన వారికి ఉచిత పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.