23-05-2025 06:57:06 PM
సింగరేణి ఏరియా జీఎం దేవేందర్
మందమర్రి,(విజయక్రాంతి): ఉన్నత విద్యలో ప్రతిభ కనబరిచిన సింగరేణి ఉద్యోగుల పిల్లలకు సింగరేణి యాజమాన్యం అందించే మెరిట్ స్కాలర్ షిప్ రూ.10 వేల చెక్ ను ఏరియా వర్క్ షాప్ లో జనరల్ మజ్దూర్ గా విధులు నిర్వహిస్తున్న బొడ్డు కుమారస్వామికి సింగరేణి ఏరియా జీఎం జి దేవేందర్ అందచేశారు. జీఎం కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మెరిట్ స్కాలర్ షిప్ చెక్ ను అందచేశారు. కార్మికుని కూతురు బొడ్డు వైష్ణవి హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో ఎంబీబీఎస్ 4వ సంవత్సరం చదువుతుంది.
ఈ సందర్భంగా ఏరియా జీఎం మాట్లాడుతూ ఉన్నత చదువులు చదువుతున్న ఉద్యోగుల పిల్లలను ప్రోత్సహించేందుకు సింగరేణి సంస్థ మెరిట్ స్కాలర్షిప్ ను అందజేస్తుందన్నారు. కార్మికులు తమ పిల్లలను ఉన్నత చదువుల దిశగా ప్రోత్సహించినందుకు తల్లి దండ్రులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, ఏఐటీయూసీ జిఎం స్ట్రక్చర్ కమిటీ మెంబర్ సివి రమణ, ఆఫీస్ సూపరింటెండెంట్ రాజలింగు లు పాల్గొన్నారు.