19-06-2025 01:00:00 AM
ప్రతిభ చూపిన మొదటి 50 మందికి రూ.5 లక్షల స్కాలర్షిప్
ఖైరతాబాద్, జూన్ 18: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్ కళాశాల(ఐఐఎంసీ) ఆధ్వర్యంలో గురువారం తమ కళాశాలలో డిగ్రీ బీబీఏ, బీఎస్సీ(డేటా సైన్స్), బీకామ్ (బిజినెస్ అనలిటిక్స్, కంప్యూటర్ సైన్స్, ఆనర్స్) కోర్సుల లో అడ్మిషన్ పొందాలనుకొనే ఇంటర్ విద్యార్థుల కోసం తెలంగాణలో మొదటిసారి అతిపెద్ద మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తుంది. ఇందులో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొని స్కాలర్షిప్కు అర్హత సాధించాలని కళాశాల ప్రిన్సిపల్ కూర రఘువీర్ పేర్కొన్నారు.
ఈ మేరకు బుధవారం స్కాలర్షిప్ టెస్ట్కు సంబంధించిన గోడ ప్రతిని విడుదల చేశారు. ఈపరీక్షలో జనరల్ ఇంగ్లీష్, ఆప్టిట్యూడ్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బేసిక్ కామర్స్కు సంబంధించిన అంశాలపై 100 మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయని పేర్కొన్నారు. పరీక్ష ఉదయం 11.00 నుంచి మ.12.30 వరకు ఉంటుంది. ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజును వసూలు చేయడం లేదు.
పరీక్షలో ఉత్తమ ప్రతిభచూపే మొదటి 50 మంది విద్యార్థులకు రూ. 5 లక్షల స్కాలర్షిప్ అందజేయనున్నట్టు ప్రిన్సిపల్ తెలిపారు. ఈ పరీక్షకు సంబందించిన సమాచారం కోసం www.iimchydera bad.com వెబ్సైట్లో చూడాలని పేర్కొన్నారు. వివరాలకు 99892 20163, 9010770605, 8790765677, 95730 27171, 94401 47113, 81435 67352 నెంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు.