19-06-2025 12:59:28 AM
హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): గోదావరి--బనకచర్ల లింకు ప్రాజెక్టును తమ మంత్రిత్వశాఖ నిబంధనలకు అనుగుణంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తుది తీసుకుంటామని కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఢిల్లీలో ఆయనతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన గోదావరి--బనకచర్ల లింక్ ప్రాజెక్టు గురించి వీరిద్దరూ చర్చించారు.
అన్ని భాగస్వామ్యపక్షాలతో చర్చించిన తర్వాత పారదర్శకమైన పద్ధతిలోనే ప్రాజెక్టుకు సంబంధించిన నిర్ణయం ఉంటుందని పాటిల్ పేర్కొన్నారు. ఈ విషయంలో ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగకుండా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కిషన్రెడ్డికి.. సీఆర్ పాటిల్ భరోసా ఇచ్చారు.