13 April, 2026 | 12:13 PM

Breaking News

వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •   మంత్రి తుమ్మలను కలిసిన మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు   •  

మేడ్చల్‌లో అర్ధరాత్రి నాకాబంది

17-10-2025 01:06 AM

మేడ్చల్, అక్టోబర్ 16(విజయ క్రాంతి): మేడ్చల్ పట్టణంలో బుధవారం అర్ధరాత్రి పోలీసులు నాకాబంది నిర్వహించారు. డిసిపి కోటిరెడ్డి ఆదేశాల మేరకు ఏసిపి శంకర్ రెడ్డి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. మార్కెట్ రోడ్ జంక్షన్, వివేకానంద విగ్రహం, వినాయక నగర్ ప్రాంతాలలో మూడు టీములు తనిఖీలు చేపట్టాయి. 192 వాహనాలు తనిఖీ చేయగా, ఇందులో 25 వాహనాలు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నట్లు గుర్తించారు.

త్రిపుల్ రైడింగ్ 3, హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన కేసులు 14, నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేసిన రెండు కేసులు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడిపిన ఆరు కేసులు నమోదయ్యాయి. మొత్తం 8 వాహనాలను సీజ్ చేశారు. రూ.23623 పెండింగ్ చలాన్ లు వసూల్ అయ్యాయని సి ఐ సత్యనారాయణ తెలిపారు. నాకాబంది కార్యక్రమంలో ఏసిపి శంకర్ రెడ్డి తో పాటు, సిఐలు సత్యనారాయణ, కిరణ్, నలుగురు ఎస్సులు, 44 మంది ఏఎస్‌ఐలు, కానిస్టేబుల్ పాల్గొన్నారు.