17 April, 2026 | 3:18 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

మంత్రి శ్రీధర్‌బాబు చిత్రపటానికి క్షీరాభిషేకం

26-12-2025 12:02 AM

కాటారం, డిసెంబర్ 25 (విజయక్రాంతి): కాటారం మండల కేంద్రం లోని అంబేద్కర్ కూడలి వద్ద మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాలాభిషేకం చేశారు. దామెరకుంట మానేరు వాగు పై 203 కోట్లు, కాటారం రోడ్డు నుండి సబ్ స్టేషన్ పల్లి వయా దుబ్బగూడెం రోడ్డు నిర్మాణంకై 3 కోట్లు , సుబ్బయ్యపల్లి నుండి ప్రతాపగిరి వరకు 3.50 కోట్ల నిధులు మంజూరు చేపించినందుకు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కు కృతజ్ఞతలు తెలుపుతూ వారి చిత్ర పటానికి కాటారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు.

అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ కాటారం మం డలాన్ని అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న మంత్రి శ్రీధర్ బాబు కి కాటారం మండల ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతూ రానున్న రోజుల్లో కాటారం మండలాన్ని మరింత అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.