22 April, 2026 | 7:23 PM

Breaking News

ఐలేని రెడ్డి సంఘం అధ్యక్షునిగా మల్లారెడ్డి   •   ఆర్టీసీ సమ్మెకు బిఆర్ఎస్ మద్దతు   •   గొర్రెల కాపరికి న్యాయం చేసిన పట్టణ సీఐ శివశంకర్   •   వేసవిలో ప్రజల దాహం తీర్చేందుకే చలివేంద్రాల ఏర్పాటు   •   గజ్వేల్ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా వార్షికోత్సవం   •   జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ అర్హత సాధించిన బెల్లంపల్లి సీఓఈ విద్యార్థులు   •   అకాల వర్షం – అన్నదాత ఆగమాగం   •   ప్రభుత్వ వైద్యసేవల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదు: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •   త్రిలింగ రామేశ్వర ఆలయాన్ని ఉమ్మడి జిల్లా సందర్శించిన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు   •   కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి: రవినాయక్   •  

మంత్రి శ్రీధర్‌బాబు చిత్రపటానికి క్షీరాభిషేకం

26-12-2025 12:02 AM

కాటారం, డిసెంబర్ 25 (విజయక్రాంతి): కాటారం మండల కేంద్రం లోని అంబేద్కర్ కూడలి వద్ద మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాలాభిషేకం చేశారు. దామెరకుంట మానేరు వాగు పై 203 కోట్లు, కాటారం రోడ్డు నుండి సబ్ స్టేషన్ పల్లి వయా దుబ్బగూడెం రోడ్డు నిర్మాణంకై 3 కోట్లు , సుబ్బయ్యపల్లి నుండి ప్రతాపగిరి వరకు 3.50 కోట్ల నిధులు మంజూరు చేపించినందుకు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కు కృతజ్ఞతలు తెలుపుతూ వారి చిత్ర పటానికి కాటారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు.

అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ కాటారం మం డలాన్ని అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న మంత్రి శ్రీధర్ బాబు కి కాటారం మండల ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతూ రానున్న రోజుల్లో కాటారం మండలాన్ని మరింత అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.