27-06-2025 01:00:53 AM
మేడ్చల్ అర్బన్, జూన్ 26:తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు భరోసా ముఖ్యమంత్రి రేవంతన్న అని మేడ్చల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. గురువారం ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి మేడ్చల్ పట్టణంలోని వివేకానంద విగ్రహం వద్ద పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా కాం గ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. రైతులకు భరోసానందిస్తూ తొమ్మిది రోజుల్లో 9,000 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ దేనని హర్షం వ్యక్తం చే శారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షుడు గోమారం రమణారెడ్డి, ముళ్ళ పోచంపల్లి పట్టణ అధ్యక్షుడు సాయి పేట శ్రీ నివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రేగు రాజు, మాది కౌన్సిలర్ కౌడె మహేష్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.