15 April, 2026 | 12:57 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మల్లన్నను దర్శించుకున్న మంత్రి అడ్లూరి

17-01-2026 02:07 AM

కొమురవెల్లి, జనవరి 16 ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ని ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో క లిసి వచ్చినా ఆయన గర్భాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారికి పట్నాలు వేసి, బోనం చెల్లించుకున్నారు. అంతకుముందు దేవాలయ అర్చకులు, కార్యనిర్వాహణ అధికారి వెంకటేష్ పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం ఆశీర్వచన మండపంలో స్వామి వారి శేష వస్త్రం, చిత్రపటం తో పాటు వేద ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు చంద్రశేఖర్, ఆలయ ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్,ఉత్సవ కమిటీ చైర్మన్ గంగం నరసింహారెడ్డి, సభ్యులు సార్ల లింగం, బొచ్చు ఎల్లయ్య, ఎలిగేల మల్లేశం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.