17 April, 2026 | 2:50 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ఘనంగా గ్రామం పుట్టినరోజు వేడుకలు

17-01-2026 02:06 AM

పాల్గొన్న ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ 

పాపన్నపేట, జనవరి 16 :మండల పరిధిలోని లక్ష్మీనగర్ గ్రామంలో ప్రతి ఏటా సంక్రాంతికి గ్రామస్తులు గ్రామం పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సారి కూడా గ్రామానికి 78వ పుట్టినరోజు వేడుక గురువారం ఘనంగా నిర్వహించారు.

మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ విచ్చేసి ముందుగా గ్రామంలోని రామాలయంలో నిర్వహించిన పూజల్లో పాల్గొన్న అ నంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో కేక్ కోసి గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్ష లు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని, లక్ష్మీనగర్ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. మండల నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.