24-07-2025 10:50:54 PM
మునిపల్లి: మండల పరిధిలోని కంకల్ గ్రామంలో రూ 2.45 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నిర్మాణ పనులను గురువారం నాడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Minister Damodar Raja Narasimha) పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు వైద్యం అందించాలని అధికారులను, సదరు కాంట్రాక్టర్లను ఆదేశించారు. మంత్రి వెంట త్రిష దామోదర, జిల్లా గ్రంధాలయ సమస్య చైర్మన్ అంజయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.