14-08-2025 12:27:53 PM
న్యాయం గెలిచింది ఎమ్మెల్యే కోవ లక్ష్మి
కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి(Asifabad MLA Kova Lakshmi) ఎన్నిక చల్లదంటూ ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీర శ్యాం నాయక్ సుప్రీంకోర్టులో(Supreme Court) దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. కోవలక్ష్మి 2023 ఎన్నికల్లో తను ఎన్నికల కమిషన్ కు అందజేసిన ఆఫ్టవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని తన ఎన్నికల లేదని హైకోర్టులో శ్యాం నాయక్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఎమ్మెల్యే కోవా లక్ష్మి కి అనుకూలంగా గతంలో తీర్పు ఇవ్వడంతో శ్యామ్ నాయక్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.ధర్మాసనం విచారణ చేపట్టి హైకోర్టు అనుకూల తీర్పును సుప్రీంకోర్టు జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్మసనం సమర్పించింది.శ్యామ్ నాయక్ పిటిషన్ ను కొట్టివేసింది.అత్యున్నత న్యాయస్థానంలో కోవలక్ష్మికి అనుకూలంగా తీర్పు రావడంతో నియోజకవర్గం లో పార్టీ శ్రేణులు, అభిమానులు, నాయకులు సంబరాలు జరుపుకుంటున్నారు.ఎమ్మెల్యే కు అభినందనలు తెలిపారు.అత్యున్నత న్యాయస్థానం న్యాయం వైపే ముగ్గు చూపిందని ఎమ్మెల్యే కోవలక్ష్మి తెలిపారు.