30 June, 2026 | 10:36 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

బీసీ రిజర్వేషన్లు పెంచకుంటే... బీజేపీ ఓటమి ఖాయం

07-08-2025 11:54 AM

బీసీ రిజర్వేషన్ల కోసం తుది వరకు పోరాడుతాం: మంత్రి పొన్నం

హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల పెంపు అమలు కోసం ఢిల్లీలో మూడో రోజు కాంగ్రెస్ మహాధర్నా పోరు కొనసాగుతోంది. బిల్లులు ఆమోదం కోరుతూ ఇవాళ రాష్ట్రపతిని కలవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇప్పటివరకు కాంగ్రెస్ నేతలకు రాష్ట్రపతి అపాయింట్ మెంట్ లభించలేదు. బీసీ రిజర్వేషన్ల కోసం తుదివరకు పోరాడుతామని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) స్పష్టం చేశారు. గాంధేయపద్దతిలో పోరాటం అనుకున్నది సాధిస్తామని తెలిపారు. కిషన్ రెడ్డి లాంటి వారి కుట్రలను సాగనివ్వమని మంత్రి పొన్నం తేల్చిచెప్పారు.

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ(Bharatiya Janata Party) చావుతప్పి కన్నలొట్ట.. అన్నట్లుగా గెలిచిందని పొన్నం విమర్శించారు. ఉత్తరాదిలో చాలా రాష్ట్రాల్లో బీసీలు బీజేపీని తిరస్కరించారని పొన్నం వివరించారు. బీసీ రిజర్వేషన్ల పెంచకుంటే వచ్చే ఎన్నికల్లో బీజీపీ ఓటమి ఖాయమని పొన్నం హెచ్చరించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ధర్నాలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ(Congress Party) ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు నాయకులకు మంత్రి పొన్నం ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక నినాదాలు తీసుకొని ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రభావితం చేయడానికి ఇంత దూరం వచ్చి జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం చేస్తున్నామంటే మన అకుంఠిత దీక్ష పట్టుదల మన ఆలోచన విధానం రాహుల్ గాంధీ నాయకత్వంలో రిజర్వేషన్లు సాధించడానికి కార్యచరణ తీసుకొని ముందుకు పోతున్నామని తెలిపారు.