30 June, 2026 | 9:39 PM

Breaking News

ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •   తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీనే... శ్రీరామరక్ష   •   రైతుల పాలిట శాపంగా మారిన యూరియా మొబైల్ యాప్: సనప విష్ణు   •   ఎఫ్‌పీఓలతో రైతులు ఆర్థికంగా బలోపేతం   •   పేదల ఇండ్ల సమస్యపై జులై 1న చలో కలెక్టరేట్   •   పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు సన్మానించిన ఎస్పీ రోహిత్ రాజ్   •  

ఎరువుల కొరత లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలి

07-08-2025 01:56 PM

కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి,(విజయక్రాంతి): జిల్లాలో రైతులకు కావాల్సిన ఎరువులకు సంబంధించి కొరత లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(Collector Adarsh Surabhi) ఆదేశించారు.  గురువారం జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ లో ఉన్న రాజారామ్ ట్రేడర్స్ ఎరువుల దుకాణాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణంలో ఎరువుల నిల్వకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ అన్ని ఎరువుల దుకాణాల బయట నిలువ, ధరల సూచిక బోర్డు ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

డిఎపి, యూరియా, జిప్సం, ఫాస్పరస్ వంటి ఎరువుల వివరాలు సూచిక బోర్డుపై ఉండాలని చెప్పారు.  ప్రతి ఎరువుల దుకాణం ముందు ఎరువుల నిల్వ, ధరల సూచిక బోర్డు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారి ఆంజనేయులు గౌడ్ ను సూచించారు. యూరియా నిలువలు, డి.ఎ.పి నిలువలు ఆన్లైన్ లో నిక్షిప్తం ఉన్న నిల్వలతో సరిపోల్చి చూసారు. జిల్లాలో రైతులకు సరిపడా యూరియా, ఇతర ఎరువులు ఉన్నాయని, కొరత లేకుండా చూసుకోవాలని సూచించారు. మండల వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు గౌడ్, ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.