12-06-2025 04:29:49 PM
ఏటూరునాగారం (విజయక్రాంతి): ములుగు జిల్లాలోని ఏటూరునాగారం మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులందరికీ టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, వర్క్ బుక్స్, యూనిఫామ్స్ ను రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క(Minister Seethakka) పంపిణీ చేశారు. ఈ కార్యక్రమములో అదనపు కలెక్టర్ రెవిన్యూ సిహెచ్ మహేందర్ జి, ఏఎస్పి శివం ఉపాధ్యాయ, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.