calender_icon.png 13 June, 2025 | 2:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత పౌరులు గర్వించదగ్గ పాలన నరేంద్రుడిది

12-06-2025 03:11:06 PM

మేడ్చల్ అర్బన్: భారత పౌరుడు గర్వించేలా ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) హయాంలో కేంద్ర ప్రభుత్వ పనితీరు ఉందని మల్కాజ్ గిరి ఎంపి ఈటల రాజేందర్(Malkajgiri MP Eatala Rajendar) అన్నారు. గురువారం శామీర్ పేట్ లోని ఆయన నివాసంలో మేడ్చల్ రూరల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు బుద్ది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 11 ఏళ్ల సుపరిపాలనపై మల్కాజ్ గిరి ఎంపి ఈటల రాజేందర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. 2014 సంవత్సరానికి ముందు దేశ ఆర్ధిక పరిస్థితి చాలా దారుణంగా ఉండేదన్నారు. దేశ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని దేశ ప్రజలు బీజేపీకి పట్టంకట్టారని, ప్రజల నమ్మకాన్ని బీజేపీ ప్రభుత్వం నిలబెట్టుకుందన్నారు.

భారత పౌరుడు గర్వించేలా మోడీ ప్రభుత్వం చేసిందన్నారు. ఆర్ధిక వ్యవస్థ పూర్తిక పడిపోయిన తరుణంలో ఆర్ధిక వ్యవస్థ 4వ స్థానానికి తీసుకువచ్చిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రపంచ దేశాలతో మంచి స్నేహపూరిత వాతావరణం తీసుకువచ్చారని చెప్పారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత మహిళల బొట్టు తుడిచేలా భార్యల ముందే భర్తలను చంపిన ఘటనకు మోడీ ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) పేరిట ప్రతీకారం తీర్చుకుందన్నారు. అనేక సంక్షేమ పథకాల తీసుకువచ్చి దేశాన్ని అభివృద్ధి బాటలో బీజేపీ నిలబెట్టిందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కూడా కేంద్రం నుండి ఎన్నో నిధుల ఇవ్వడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించడం లేదని చెప్పడం దారుణం అన్నారు.

బీజేపీ ప్రచారంలో వెనకబడి ఉంది: మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే విజయరామారావు

బీజేపీ ప్రభుత్వం అభివృద్ధిలో ముందుంది గాని చేసిన అభివృద్ధిని ప్రచారం చేయడంలో వెనకబడి ఉందని మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే విజయరామారావు అన్నారు. శామీర్ పేట్ లోని మల్కాజ్ గిరి ఎంపి ఈటల రాజేందర్ నివాసంలో బీజేపీ 11 సంవత్సరాల సుపరిపాలనపై నిర్వహించిన మీడియా సమావేశం లో విజయరామారావు మాట్లాడారు. కుంభకోణాల్లో, దోపిడీలో, మొదల్లో అప్పటి కాంగ్రెస్ కేంద్ర మంత్రులు ఇప్పటికీ జైలు జీవితం గడుపుతున్నారని అన్నారు. ఎలాంటి అవినీతికి తావు లేకుండా బిజెపి ప్రభుత్వం దేశంలో పాలన సాగిస్తుందన్నారు. మోడీ రాకముందు దేశంలో నిరుద్యోగ సమస్య, ఆర్ధిక సమస్య బాగా ఉండేదన్నారు. ప్రధాని దేశ అభివృద్ధిలో మహిళలకు మహిళా రిజర్వేషన్, మహిళా బిల్లుతో వారిని భాగస్వాములుగా చేర్చారన్నారు. దేశంలోని మారు మూల గ్రామాలకు కూడా మరుగుదొడ్లను కట్టించిన మోడీకే దక్కుతుందన్నారు. 

మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ బిజెపి పార్టీ: బిజెపి రాష్ట్ర కార్యదర్శులు ఆకుల విజయ

దేశంలో మహిళలకు ప్రాధాన్యతను ఇచ్చిన పార్టీ బిజెపి పార్టీ అని బిజెపి రాష్ట్ర కార్యదర్శులు ఆకుల విజయ అన్నారు. మహిళా రిజర్వేషన్, మహిళా బిల్లు తో ప్రధాని మోడీ మహిళలకు దేశ అభివృద్ధిలో భాగం చేశారని ఆమె తెలిపారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో టెర్రరిస్టుల గుండెల్లో గుబులు పూటించారన్నారు. దేశ అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలను కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు.