మంత్రి తుమ్మల పరామర్శ
ములకలపల్లి / అన్నపురెడ్డిపల్లి, జనవరి 16,( విజయక్రాంతి):అన్నపురెడ్డిపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వనమా గాంధీ ని శుక్రవారం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు.ఇటీవల అనారోగ్య సమస్యతో కేర్ ఆస్పటల్ నందు చికిత్స పొంది ఇంటికి వచ్చిన మండల అధ్యక్షులు వనమా గాంధీని ఆరోగ్య సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయ చైర్మన్ మల్లెల నరసింహారావు హరిహర ఫౌండేషన్ వ్యవస్థాపకులు మారగాని శ్రీనివాసరా వు,పైడి వెంకటేశ్వరరావు,జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు బానోతు భీముడు నాయక్ కాంగ్రెస్ పార్టీ మండల యువజన అధ్యక్షులు వేముల నరేష్ బాబు,దోసపాటి రాంబాబు యాదాల వెంకన్న, సుగ్గల నరసింహారావు,సర్పంచ్ లాకవత్ లక్ష్మీ, ఉప సర్పంచ్,మారగాని అశోక్, కటారి రాజబాబు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.






