28 July, 2026 | 1:50 PM

Breaking News

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన కేటీఆర్   •   మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •  

హుస్నాబాద్‌లో మంత్రులు పొన్నం, వాకిటి శ్రీహరి పర్యటన

15-11-2025 10:59 AM

హైదరాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో(Husnabad) మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఫిషరీస్ కార్పొరేషన్ మెట్టు సాయి శనివారం నాడు పర్యటించారు. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువుకట్ట సుందరీకరణ పనులను పరిశీలించిన మంత్రులు ఎల్లమ్మ చెరువులో చేపపిల్లలు వదిలారు. హుస్నాబాద్ పట్టణంలో శిథిలావస్థకు చేరిన పశువుల వైద్యశాలను పరిశీలించారు. పశువుల వైద్యశాలను ఆధునీకరించి అభివృద్ధి చేయాలని పొన్నం ప్రభాకర్, మంత్రి వాకిటి శ్రీహరిని కోరారు. హుస్నాబాద్ పశు వైద్యశాలను పరిశీలించి ఆధునీకరిస్తామని వాకిటి శ్రీహరి హామీ ఇచ్చారని పొన్నం పేర్కొన్నారు. హుస్నాబాద్ పర్యటనలో భాగంగా స్థానిక ఫిష్ మార్కెట్ పరిశీలించారు. మత్స్యకారులతో మాట్లాడి వ్యాపారం లావాదేవీ, మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. త్వరలోనే హుస్నాబాద్ లో అత్యాధునిక మోడర్న్ ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేస్తామని మంత్రి వాకిటి శ్రీహరి మత్స్యకారులకు హామీ ఇచ్చారు.