17-06-2025 12:00:00 AM
భైంసా, జూన్ 16 (విజయక్రాంతి): నిర్మ ల్ జిల్లా శ్రీ సరస్వతి మాత ఆలయం వద్ద గోదావరిలో రాజస్థాన్ కుటుంబం చెందిన ఐదుగురు యువకులు నీటిలో మృతిచెంది న ఘటన నేపథ్యంలో సోమవారం అధికారులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ జానకి షర్మిల బైంసా ఆర్డిఓ కోమల్ రెడ్డి ఆలయ అధికారు లు రెవెన్యూ సిబ్బంది సందర్శించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకు న్నారు.
గోదావరిలో బోటు షికారాన్ని రద్దు చేశా రు. పుష్కర గట్ల వద్ద ఇనుపంచలు ఏర్పాటు చేయాలని ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి గస్తీ బృందాన్ని పెంచాలని నిర్ణయించారు. పుష్కర గట్ల వద్ద పోలీస్ సిబ్బందిని అదనం గా నియమించాలని అందుబాటులో ఉండే లా చర్యలు తీసుకోవాలన్నారు. బోటు యజమానులతో సమావేశం నిర్వహించి భక్తుల ను గోదావరిలోనికి షికారు కోసం తీసుకెళ్లవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు సిబ్బంది ఉన్నారు.