17 April, 2026 | 2:46 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

మిషన్ భగీరథ పనులు వేగవంతంగా చేయాలి

26-04-2025 12:49 AM

కలెక్టర్ ఆశీస్ సంగ్వాన్

కామారెడ్డి టౌన్, ఏప్రిల్ 25 (విజయ క్రాంతి): షన్ భగీరథ పైప్ లైన్ పను లు వేగవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ, మున్సిపల్ అధికారులతో శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అర్గుల్ (నిజామాబాద్ జిల్లా) నుండి కామారెడ్డి కి సరఫరా చేసే మిషన్ భగీరథ 14 కిలోమీటర్ల  పైప్ లైన్ పనులు వేగంగా పూర్తిచేయాలని అన్నారు. కామారెడ్డి మున్సిపల్ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు నీటి సరఫరా చేస్తున్న వివరాలు ఎరోజుకు ఆరోజు సమర్పించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

రోజువారీ కామారెడ్డి కి వస్తున్న నీరు వార్డుల వారీగా సరఫరా చేస్తున్న వివరాలు ప్రతీరోజు సమర్పించాలని అన్నారు. పట్టణ ప్రాంతంలో రీచార్జ్ స్ట్రక్చర్స్ నిర్మాణాలు చేపట్టాలని, ఇంకుడు గుంతలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, వచ్చే వర్షాకాలం నాటికి రీఛార్జ్ స్ట్రక్చర్స్ నిర్మించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్, మిషన్ భగీరథ ఎస్‌ఈ రాజేంద్ర కుమార్, ఈఈ నరేష్, మున్సిపల్ కమీషనర్ రాజేందర్ రెడ్డి, ఏఈఈ శంకర్, తదితరులు పాల్గొన్నారు.