calender_icon.png 3 November, 2025 | 1:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిమ్స్‌లో చికిత్స కోసం ఎమ్మెల్యే భరోసా

01-11-2025 12:00:00 AM

రూ. లక్ష  ఎన్‌ఓసి అందజేసిన బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి 

భీంగల్, అక్టోబర్31 (విజయక్రాంతి): మండలంలోని  బాబా పూర్ గ్రామానికి చెందిన సయ్యద్ హయత్ ఇటీవల యాక్సిడెంట్ కి గురై నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స కోసం చేరడంతో ఈ విషయం స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి  దృష్టికి ఆర్థిక సహాయ విషయమై నివేదించారు.

ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వెంటనే స్పందించి మెరుగైన చికిత్స కొరకు 1 లక్షల రూపాయల ఎన్ ఓ సి  మంజూరు చేయించి ఎల్ ఓ సి కాపీ ని వారి కుటుంబ సభ్యులకు శుక్రవారం   హైదరా బాద్‌లోని తన నివాసంలో ప్రశాంత్ రెడ్డి అందజేశారు.

నిరుపేదలమైన మాకు మెరు గైన వైద్య చికిత్స కొరకు  1 లక్ష రూపా యల ఎల్‌ఓసి  మంజూరు చేసిన ప్రశాంత్ రెడ్డి మేలు మర్చి పోలేమని ఈ సందర్భంగా  వారి కుటుంబ సభ్యులు మాజి మంత్రి, ఎమ్మెల్యే వేములకు కృతజ్ఞతలు తెలిపారు.