10-06-2025 02:22:21 PM
హైదరాబాద్: మంత్రివర్గ విస్తరణపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Khairatabad MLA Danam Nagender) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదవులపై కాంగ్రెస్ పార్టీలో హామీలు ఏమీ ఉండవని దానం తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేసే వారికే పదవులు దక్కతాయని ఆయన స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణ తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని దానం పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) సామాజికన్యాయం పాటిస్తూ మంత్రివర్గ విస్తరణ చేశారని చెప్పారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఎస్సీ, బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. హైదరాబాద్ కు మంత్రి పదవి విషయంలో ఇంకా వేచి చూడాలన్నారు. రాహుల్ గాంధీ ఆశయాలను సీఎం రేవంత్ రెడ్డి ముందుకు తీసుకెళ్తున్నారని ఎమ్మెల్యే దానం సూచించారు. హిమాయత్ నగర్ లో రూ. 60 లక్షల రోడ్డు పనులను ఎమ్మెల్యే దానం మంగళవారం నాడు ప్రారంభించారు. 150 మందికి కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.