27-07-2025 04:25:36 PM
కొత్తపల్లి,(విజయక్రాంతి): కరీంనగర్ నగరంలోని 18వ డివిజన్ రేకుర్తిలో నూతనంగా ఏర్పాటు చేసిన వారాహి ఫుడ్ కోర్టును కరీంనగర్ మాజీ మంత్రి-శాసనస భ్యులు గంగుల కమలాకర్ ప్రారంబించారు. మాజీ డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్ , 18వ డివిజన్ మాజీ కార్పోరేటర్ సుధగోని మాధవి-కృష్ణగౌడ్ 19వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఏదుల్ల రాజశేఖర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారాహి ఫుడ్ కోర్ట్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిధులకు శాలువాతో సన్మానం చేసి పుష్ప గుచ్చాలు అందించారు. అనంతరం నిర్వాహకులు రవీందర్ నూతనంగా ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్ట్ లోని వంటకాలను కొత్త తరహా వంటకాలను రుచి చూపించారు. చాలా బాగా వంటలు ఉన్నాయని ఇలానే నాణ్యతగా రుచిగా కస్టమర్లందరికీ అందించాలని వ్యాపారాన్ని భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలని రవీందర్ కు ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో 18వ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు రేగుల ఏల్లయ్య నేరెళ్ల అజయ్ బోయిని అనిల్ రేగుల శ్రీనివాస్ జునెద్ తిరుపతి సత్యం హరీష్ శశి తదితరులు పాల్గొన్నారు.