శ్రీ లక్ష్మీ నరసింహ బ్రిక్స్ ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే
కల్లూరు (విజయక్రాంతి): మండల పరిధి చెన్నూరు గ్రామంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కె.వి.ఆర్ నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీనరసింహ బ్రిక్స్ ప్లాంటును సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయి దయానంద్(MLA Matta Ragamayee Dayanand) ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... నాణ్యమైన బ్రిక్స్ మండల ప్రజలకు అందించి కస్టమర్ల మన్ననలు పొందాలని బ్రిక్స్ వ్యాపారం అభివృద్ధి చెందాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏం సి చైర్మన్ భాగం నీరజా ప్రభాకర్ చౌదరి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆళ్ళకుంట నరసింహారావు, మండల కాంగ్రెస్ నాయకులు ఏనుగు సత్యంబాబు, బత్తుల రాము, అర్జున్ రావు, ఏం సి డైరెక్టర్ లింగనబోయిన పుల్లారావు,మర్శకట్ల బాలసౌరి,మచ్ఛా వెంకటేశ్వరరావు,వీరబాబు, నల్లగట్ల పుల్లయ్య,భూక్య శివకుమార్ నాయక్, మట్ట రామకృష్ణ గౌడ్, సంపసాల వెంకటకృష్ణ,పొన్నూరు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.






