15-10-2025 07:27:23 PM
దౌల్తాబాద్: దౌల్తాబాద్ పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షుడు ఉమ్మడి నర్సింహా రెడ్డి తల్లి ఇటీవల మృతిచెందిన విషయం తెలుసుకున్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి బుధవారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆయనతో పాటు బిఆర్ఎస్ మండల సయ్యద్ రహీమొద్దీన్, నాయకులు రణం శ్రీనివాస్ గౌడ్, అప్పవారి శ్రీనివాస్, పబ్బ అశోక్ గుప్తా తదితరులున్నారు.