25-10-2025 08:39:22 PM
ఎలాంటి కటింగ్ లేకుండా బస్తాలు దిగుమతి చేసుకోవాలి
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం
మల్యాల,(విజయక్రాంతి): చొప్పదండి నియోజకవర్గ మల్యాల మండలంలోని ముత్యంపేట, రామన్నపేట గ్రామాలలో సహకార సంఘం, ఐకెపి ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను చొప్పదండి శాసన సభ్యులు మేడిపెల్లి సత్యం శనివారం ప్రారంభించారు. గత ప్రభుత్వం లాగా రైతుల దగ్గర నుండి ఈ సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎలాంటి కటింగ్ లేకుండా రైతుల ధాన్యం బస్తాలు రైస్ మిల్లర్ల దించుకోవాలని ఆదేశించారు. రైతులకు ఒక్క పైసా కూడా నష్టం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.