calender_icon.png 13 June, 2025 | 1:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మండల కేంద్రమైన గుణాలకు ఎక్కువ మొత్తంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి

12-06-2025 11:31:29 AM

ఎమ్మెల్యేను కోరిన టిడిపి మండల కమిటీ 

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): మండల కేంద్రమైన గుండాలకు పెద్ద మొత్తంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని తెలుగుదేశం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం పిలపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లను కలిసి వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే  సానుకూలంగా స్పందించారనీ , తరహాలో మండల కేంద్రంలో గల పలు సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టి కి తీసుకువెల్లగా వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హమీ ఇచ్చినట్లు నాయకుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గుండాల మండల నాయకులు ఇల్లందుల అప్పారావు. ఇల్లందుల నరసింహులు చీకటి యాకయ్య,వాగబోయిన కృష్ణ  పాల్గొన్నారు.