12-06-2025 11:31:29 AM
ఎమ్మెల్యేను కోరిన టిడిపి మండల కమిటీ
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): మండల కేంద్రమైన గుండాలకు పెద్ద మొత్తంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని తెలుగుదేశం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం పిలపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లను కలిసి వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారనీ , తరహాలో మండల కేంద్రంలో గల పలు సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టి కి తీసుకువెల్లగా వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హమీ ఇచ్చినట్లు నాయకుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గుండాల మండల నాయకులు ఇల్లందుల అప్పారావు. ఇల్లందుల నరసింహులు చీకటి యాకయ్య,వాగబోయిన కృష్ణ పాల్గొన్నారు.