12-06-2025 11:33:48 AM
భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ గోపాల కృష్ణారావు గురువారం నాడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాన దేవాలయం వద్ద ఆలయ సంప్రదాయంతో అధికారులు అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలోని సీతారామచంద్ర స్వామి వారి మూల విగ్రహాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీ చాయారు అమ్మవారి సన్నిధిలో వేద పండితులు వేద ఆశీర్వాదం నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. జడ్జి వెంట భద్రాచలం మెజిస్ట్రేట్ శివ నాయక్ దేవస్థానం ఎ ఈవో శ్రవణ్ కుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు