06-06-2025 01:17:09 AM
నారాయణఖేడ్, జూన్ 5: నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని ఆయా వార్డులలో గురువారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం సంబంధించి భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పట్టణంలో ఆయా వార్డులలో పర్యటిస్తూ స్థానిక ప్రజలతో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
మున్సిపాలిటీ పరిధిలో తాగునీటికి సంబంధించి పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. పర్యావరణం దినోత్సవం సందర్భంగా స్థానిక ఆక్సిజన్ పార్కులో మొక్కలను నాటారు. అనంతరం పార్క్ ఆవరణలో చెత్తాచెదారం తొలగించే పనులను చేపట్టారు. ప్రతి ఒక్కరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్,ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి హౌసింగ్ డిఇ సతీష్ తివారి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్, కౌన్సిలర్లు వివేకానంద హనుమాన్లు సద్దాం మాజీద్ , మూడరామకృష్ణ, పండరి రెడ్డి, ముంతాజ్, శ్రీకాంత్ రెడ్డి, శంకర్ ముదిరాజ్, శేఖర్ సెట్ ,నరేష్ యాదవ్, మొయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.