30-06-2025 02:25:51 AM
కామారెడ్డి, జూన్ 29 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని భూలక్ష్మి ,మహాలక్ష్మి అమ్మవారిని ఆదివారం నాడు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి దర్శించుకుని ఆమెకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అలంకరణ రెడ్డి తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన రేకుల షెడ్డు ను ప్రారంభించారు. ఆయనకు ఆ కాలనీవాసులు స్వాగతం పలికి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కుంట లక్ష్మారెడ్డి, బిజెపి మండలాధ్యక్షుడు భూపాల్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు రవీందర్ రెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షుడు కంది మనోజ్, నరేందర్ రెడ్డి, పూనా లక్ష్మణ్, కొండ శీను, చెప్పాల రవి, ఎల్లయ్య, రాజనర్సింహ తో పాటు పలువురు భక్తులు బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.