calender_icon.png 30 June, 2025 | 9:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూలై 4లోగా పాలిటెక్నిక్ కళాశాలలో సీట్ పొందాలి

30-06-2025 02:27:22 AM

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ విజయ్ కుమార్

కామారెడ్డి, జూన్ 29 (విజయ క్రాంతి), పాలిసెట్లో ఉత్తీర్ణులై ర్యాంక్ సాధించిన వారికి సీటు కేటాయించిన విద్యార్థులు జులై 4 లో గా అడ్మిషన్ పొందాలని కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయకుమార్ తెలిపారు. పాలీసెట్ మొదటి దశ ధ్రువపత్రాల పరిశీలన విజయవంతంగా ముగిసిందని తెలిపారు. విద్యార్థు లు తమకు నచ్చిన పాలిటెక్నిక్ కళాశాల లో అడ్మిషన్ పొందవచ్చని తెలిపారు.

గత మూడు రోజుల్లో 416 మంది విద్యార్థుల ధ్రువపత్రాలను పరిశీలించి కన్ఫర్మేషన్ లెటర్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇటువంటి మరిన్ని ఉన్నత శిఖరాల అందుకుని తల్లిదండ్రులకు చదువు నేర్పిన గురువులకు పేరు ప్రతిష్టలు తీసుకరావాలని ఆయన కోరారు. విద్యార్థులకు ద్రోపత్రాల కన్ఫర్మేషన్ లెటర్ ఇస్ జూలై నెల ఒకటి వరకు విద్యార్థులు తమకు నచ్చిన కళాశాల ఆప్షన్ ఇవ్వాలని జూలై 4న మొదటి విడత సీట్ అలాట్మెంట్ జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆఫీసర్స్ అజహారుద్దీన్, ఫర్విన్ ఫాతిమా, ఆరే శ్రీలత, ఆఫ్రిన్ ఫాతిమా, పవన్ కుమార్ ఇబ్బంది కనకరాజు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.  ఉత్తీర్ణులైన వారికి సీట్ అలాట్మెంట్విజయంతంగా ముగిసిన పాలీసెట్ మొదటి దశ ధ్రువపత్రాల పరిశీలన* ప్రభుత్వ ఆరట్స్ మరియు సైన్స్ కళాశాల,కామారెడ్డి లో గత 3 రోజులుగా జరుగుతున్న పాలీసెట్ మొదటి దశ ధ్రువపత్రాల పరిశీలన ఈ రోజు విజయవంతంగా ముగిసినదని కళాశాల ప్రిన్సిపాల్ మరియు సమన్వయకర్త డా విజయ్ కుమార్ తెలిపారు .

ఈ 3 రోజులలో 416 మంది విద్యార్థుల ధ్రువపత్రాలు పరిశీలించి కన్ఫర్మేషన్ లెటర్ అందించడం జరిగింది. ఈ సందర్బంగా పాలీసెట్ ఎంట్రెన్స్ టెస్ట్ లో ఉత్తమ ర్యాంక్ సాధించిన విద్యార్థులను  ప్రిన్సిపాల్ మరియు సమన్వయకర్త డా విజయ్ కుమార్ మరియు ఇతర సిబ్బంది ప్రత్యేకంగా అభినందిస్తు జీవితములో ఇటువంటి మరిన్ని ఉన్నత శిఖరాలు అందుకొని తల్లిదండ్రులకు, చదువు నేర్పిన గురువులకు పేరు ప్రతిష్టలు తిసుకురావాలని కోరారు.

విద్యార్థులకు ధ్రువపత్రాల కన్ఫర్మేషన్ లెటర్ ఇస్తూ జూలై నెల 1 వరకు విద్యార్థులు తమకు నచ్చిన కాలేజి కొరకు ఆప్షన్ ఇవ్వాలని జూలై 4 న మొదటి విడత సీట్ అలాట్మెంట్ జరుగుతుందని తెలిపారు . ఈ ధ్రువపత్రాల పరిశీలన లో వెరిఫికేషన్ ఆఫీసర్స్ అజహారోద్దిన్ ,ఫర్హీన్ ఫాతిమా ,అరె శ్రీలత ,ఆఫ్రీన్ ఫాతిమా, పవన్ కుమార్  మరియు సిబ్బంది కనకరాజు, నాగరాజు పాల్గొన్నారు