5 March, 2026 | 5:18 PM

Breaking News

నిబద్ధత కలిగిన మార్సిస్టు కార్యకర్త కామ్రేడ్ సింగపంగా ముత్తమ్మ   •   సైనిక స్కూల్ ఎంట్రన్స్ పరీక్షా ఫలితాల్లో... క్రాంతి కీన్ అకాడమీ సత్తా.   •   కరెంట్ తగిలి రైతుమృతి   •   రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి   •   మాచన రఘునందన్‌కు డబ్ల్యూహెచ్ఓ ప్రశంసలు   •   ఐనవోలు మల్లికార్జున స్వామిని దర్శించుకున్న కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్   •   సిఎస్ఆర్ నిధులను నిర్వాసిత గ్రామాల అభివృద్ధికి వెచ్చించాలి   •   ఆర్ట్స్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం   •   శివాజీ విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలి   •   పరీక్షలు అంటే భయం వీడాలి   •  

రాష్ట్రస్థాయి పోటీలకు మోడల్ స్కూల్ విద్యార్థులు

05-12-2025 04:25 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ తెలంగాణ ఆదర్శ పాఠశాల (model school) విద్యార్థులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తరపున రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ముత్యం బుచ్చన్న శుక్ర వారం తెలిపారు. ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు మహబూబాబాద్ జిల్లా గార్ల గ్రామంలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఏ అక్షిత్, పి అశ్విని, ఎం సుష్మిత, పి స్నేహచైత్రలు పాల్గొంటారన్నారు. వీరిని కళాశాల ప్రిన్సిపాల్ బుచ్చన్న తో పాటు డిఐఈఓ (DIEO) అంజయ్య, ఉమ్మడి ఆదిలాబాద్ కళాశాల క్రీడల సమాఖ్య కార్యదర్శి బి. బాబురావు, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, పిడి (PD) ఎన్ సుదీప్, కళాశాల అధ్యాపక బృందం ప్రత్యేకంగా అభినందించారు.