15 April, 2026 | 12:54 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

05-12-2025 04:51 PM

లక్షెట్టిపేట,(విజయక్రాంతి): మండలంలోని అంకత్ పల్లె గ్రామానికి చెందిన ఎంబడి  రాజలింగు(51) అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడని ఎస్ఐ గోపతి సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు గత నెల ఐదవ తేదీన ఉదయం ఇంటి నుండి వాకింగ్ కు  బయలుదేరి ఈనాడు ఆఫీస్ వరకు వెళ్లి తిరిగి వస్తుండగా లక్షెట్టిపేట వైపు నుండి మంచిర్యాల వైపుకు వెళుతున్న కారు వెనకాల నుండి ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయన్నారు. గాయపడ్డ రాయలింగును స్థానికులు కుటుంబ సభ్యులు మంచిర్యాల ఆసుపత్రికి తరలించి చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు. మృతుని భార్య ఎంబడి  భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.