23-04-2025 01:28:36 AM
జమ్మూ ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని పర్యటన రద్దు
జెడ్డా, ఏప్రిల్ 22: రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రధానికి సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికింది. ప్రధాని ప్రయాణిస్తున్న విమానం సౌదీ గగనతలంలోకి చేరుకోగానే.. రాయల్ సౌదీ ఎయిర్ ఫోర్స్కు చెందిన ఎఫ్ విమానాలు దాని ని అనుసరించి సగౌరవంగా స్వాగతం పలికాయి.
ఇందుకు సంబంధించిన వీడియోను భారత విదేశాంగ శాఖ సోషల్ మీడియాలో పంచుకుం ది. రెండు దేశాల మధ్య ఇంధనం, వాణి జ్యం, రక్షణ వంటి పలు రంగాల్లో సహకారం మరింత బలోపేతం చేసేందుకు ఈ పర్యటన తోడ్పడనుంది. జెడ్డాలో అడుగుపెట్టిన ప్రధానికి ఘనస్వాగతం లభించింది.
21 గన్ సె ల్యూట్స్తో ఘనస్వాగతం పలకగా.. భారత కమ్యూనిటీ ‘సారే జహాసె అచ్చా’ గీతాన్ని ఆలపించారు. భారతీయులకు హజ్ యాత్ర కోటాను పెంచాలని మోదీ కోరనున్నారు.
పర్యటన రద్దు
సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని జమ్మూకశ్మీర్ ఉగ్రదాడుల నేపథ్యంలో తన పర్యటనను రద్దు చేసుకు న్నా రు. ఉగ్రదాడి విషయం తెలిసిన వెంటనే హోం మంత్రికి ఫోన్ చేసి పరిస్థితి తెలుసుకున్న మోదీ.. అనంతరం పర్యటన రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించారు. బుధవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో మోదీ ఢిల్లీకి చేరుకోనున్నారు.