24-01-2026 10:05:44 AM
బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడు మండలం కృష్ణ సాగర్ గ్రామంలో నిర్వహిస్తున్న ఇర్రి రవి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిశాయి. ఫైనల్ మ్యాచ్ లో మోహన్ లెవెన్ జట్టు శాంతి యూత్ జట్టుపై విజయం సాధించింది.విజేతలకు స్థానిక సర్పంచ్ తాటి వాణి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కార్యదర్శి బోడ దివ్య,గుర్రం సురేష్,కాంగ్రెస్ నాయకులు కనితి దేవ,ప్రసాద్,ఎడ్ల రాంబాబు గ్రామస్తులు యువకులు తదితరులు పాల్గొన్నారు.