28-06-2025 05:54:11 PM
ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు రామగిరి మహేష్
బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): జులై 7న ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని ఆ సoస్థ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు రామగిరి మహేష్ అన్నారు. బెల్లంపల్లి హనుమాన్ బస్తిలో శనివారం జరిగిన ఎమ్మార్పీఎస్ పట్టణ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎమ్మార్పీఎస్ ఆవిర్భావం తో పాటు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు కూడా వాడవాడలా జరపాలని పిలుపునిచ్చారు.
ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం, వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ప్రతి పట్టణo, మండలం, పల్లెల్లో అట్టహాసంగా జరపాలన్నారు. అందులో భాగంగానే ఎమ్మార్పీఎస్ శ్రేణులు ఎమ్మార్పీఎస్ జెండాను ఆవిస్కరించాలన్నారు. ఈ రెండు వేడుకలను పండుగలాగా ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు జరుపుకోవాలన్నారు.