28-06-2025 06:00:27 PM
నిర్మల్,(విజయక్రాంతి): యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ అన్నారు. శనివారం కుంటాల మండలంలోని కల్లూరు గ్రామంలో మత్తు పదార్థాల నియంత్రణ అవగాహన ర్యాలీ లో పాల్గొన్నారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల ఆరోగ్యం దెబ్బ తినడమే కాకుండా కుటుంబాల్లో అనేక పరిణామాలు చోటుచేసుకుంటాయని అవి మానసిక ప్రశాంతతను దూరం చేస్తాయని తెలిపారు.
గ్రామాల్లో మత్తు పదార్థాల నియంత్రణకు పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుందని అందుకు ప్రజలు కూడా సహకారం అందించాలన్నారు. అనంతరం పరిసరాల పరిశుభ్రత పై గ్రామంలోని పలు వార్డులను సందర్శించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మురికి కాలువలను శుభ్రంగా ఉంచాలని కృలీన పదార్థాలు చెత్తబుట్టిలో వేయాలన ప్రజలకు సూచించారు