07-02-2026 12:37:39 AM
ముకరంపుర బీజేపీ 51వ డివిజన్ అభ్యర్థి బండారి వేణు
ముకరంపురా, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): తనకు ఓటువేసి ఆశీర్వదించి కార్పొరేటర్గా గెలిపిస్తే డివిజన్ను మరింత అభివృద్ధి చేస్తానని, అభివృద్ధే నా ప్రధాన ఎజెండా అని బీజేపీ 51వ డివిజన్ అభ్యర్థి బండారి వేణు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం డివిజన్ లోని గడప గడపకు వెళ్లి ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు.ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ సహా య మంత్రి బండి సంజయ్ కుమార్ తెచ్చిన నిధులతోనే నగరం అభివృద్ధి చెందిందన్నారు.
కేంద్ర ప్రభుత్వం కరీంనగర్ ను స్మార్ట్సటీగా ఎంపిక చేసి నిధు లు విడుదల చే సిందని, నిధులతోనే న గరంలో అభివృద్ధి పనులు పూర్తి చేశారని తెలిపారు. డివిజన్ అభివృద్దితో పాటు ప్రజలకు ఎలాంటి సమస్య రాకుండా ప్రత్యేక శ్రద్ధ చూపు తానన్నారు. డివిజన్ ప్రజలకు తాను చేసిన సేవలు తెలుసునని తమ మరో మారు ఆశీర్వదించాలని మీలో ఒకనిగా సేవ చేసే అవకాశం కల్పించాలని బండారి వేణు కోరారు.