17 April, 2026 | 11:33 AM

భక్తులతో కిటకిటలాడిన నాచగిరి క్షేత్రం

02-06-2025 12:37 AM

గజ్వేల్ జూన్ 1 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వేసవి సెలవులు కావడంతో నాచగిరి క్షేత్రాన్ని దర్శించుకోవడానికి  విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి  ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. క్షేత్రానికి విచ్చేసిన భక్తులకు సిబ్బంది ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేయడంతో పాటు అన్నప్రసాదాన్ని అందించారు.