02-06-2025 12:36:23 AM
నిరుపేదలకు అన్నదానం నిర్వహించిన శ్రీకాంత్
చేగుంట, జూన్ 1 : పార్టీలకు అతీతంగా ప్రజా సేవ చేయడం ఎంతో సంతృప్తినిస్తుందని చేగుంట మండల కాంగ్రెస్ యువ నాయకుడు సండ్రుగు శ్రీకాంత్ తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా ఆదివారం తూప్రాన్ ప్రభుత్వాసుపత్రిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేసి నిరుపేదలకు తానే స్వయంగా అన్నదానం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాపాలన సాగిస్తుందన్నారు. మహిళలకు పెద్దపీట వేస్తూ ఉచిత బస్సు, రూ.500 సిలిండర్, రూ.200 యూనిట్ల ఉచిత కరెంట్తో పాటు మహిళా సంఘాలను ప్రోత్సహించేలా అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని, దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చేగుంట మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.