calender_icon.png 8 June, 2025 | 2:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే ప్రధమ కర్తవ్యం

07-06-2025 08:12:08 PM

రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు..

ఖమ్మం (విజయక్రాంతి): మనిషి తన జీవితంలో ఆనందంగా జీవితం కొనసాగించడానికి ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే ప్రధమ కర్తవ్యంగా ఉండాల్సిన అవసరం వుంది అని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్(Chairman of the State Warehousing Corporation) రాయల నాగేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం మంచికంటి భవన్ లో CPM పార్టీ ఖమ్మం టూ టౌన్ కమిటీ, బోడేపూడి విజ్ఞాన కేంద్రం (BVK) ఆధ్వర్యంలో జరిగిన బిపి, షుగర్ మెడికల్ క్యాంపు విజయవంతం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాయల నాగేశ్వరరావు మాట్లాడుతూ... ఆధునిక కాలంలో మానవుడు తన అవసరాల కోసం సంపాదన ధ్యాసలో పడి తన ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా వుండటం వల్ల చిన్న వయసులోనే చాలా పెద్ద ఆనారోగ్య సమస్యలతో బారిన పడుతున్నారు అని ఆందోళన వ్యక్తం చేశారు. ఆనారోగ్యం వచ్చిన తర్వాత ఎంత డబ్బులు పెట్టినా ఒక్కో సారి ప్రాణం దక్కదని, చిన్నప్పుడు నుంచి ప్రతి మనిషి వ్యాయామం చేయడంతో పాటు రెగ్యులర్ గా వైద్య పరీక్షలు చేయించుకోవాలి అని సూచించారు. 

ఈ సందర్భంగా ప్రముఖ డాక్టర్లు అళనే ప్రవీణ్ కుమార్, యాలమూడి వినిషా, యాలమూడి వినోద్, సి భారవి, కొల్లి అనుదీప్, జి రాజేష్, జెట్ల రంగారావు, పిల్లలమర్రి సుబ్బారావు, పార్టీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్, నాయకులు వై శ్రీనివాసరావు, బోడపట్ల సుదర్శన్, శివనారయణ, అఫ్జల్, రామారావు, పి వాసు, వాసిరెడ్డి వీరభద్రం, నాగేశ్వరరావు, భద్రం, తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.