2 May, 2026 | 1:07 PM

Breaking News

అత్తను హెల్మెట్‌తో కొట్టి చంపిన అల్లుడు... పట్టించిన సీసీటీవీ ఫుటేజ్   •   వెలిమినేడు నోష్ ల్యాబ్ వద్ద కార్మికుల ధర్నా   •   ‘ప్రజాదర్బార్’లో ప్రజల సమస్యలకు పరిష్కారం – ప్రజల వద్దకే పాలన   •   శంషాబాద్ ORR ప్రమాద మృతులకు కేటీఆర్ నివాళి   •   లక్షల ఫోన్లలో ఒకేసారి సైరన్ శబ్దం   •   విజయ్ ఫ్యాన్స్‌కు నిరాశ.. గంటల తరబడి వేచి ఉన్న అభిమానులు   •   ప్రియుడు మోసం చేశాడని.. పోలీస్ స్టేషన్‌పై నుంచి దూకేసిన యువతి   •   రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్‌పై కేసు నమోదు   •   బెంగాల్‌లో రీపోలింగ్: తొలి 2 గంటల్లో 16.23 శాతం ఓటింగ్   •   వడ్లు కొనుగోలులో జాప్యం.. రాఘవాపూర్ చౌరస్తాలో రైతుల ధర్నా   •  

విద్యార్థులకు నాసా కిట్లు అందజేత

08-12-2025 07:38 PM

కరీంనగర్ క్రైమ్ (విజయక్రాంతి): స్థానిక బోయవాడ శ్రీ చైతన్య పాఠశాలలో నాసా ప్రాజెక్టులలో పాల్గొన్న విద్యార్థులందరికీ ముఖ్యఅతిథి ఎస్ఆర్ఆర్ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపల్ మధుసూదన్ రెడ్డి చేతులమీదుగా నాసా కిట్లు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి, పిల్లలు చదువుతో పాటు అన్ని రంగాలలో ముందుండేలా ప్రోత్సహించిన శ్రీ చైతన్య యాజమాన్యాన్ని అభినందించారు.

ఈ సందర్భంగా కోఆర్డినేటర్ ప్రవీణ్ మాట్లాడుతూ, ఈ యొక్క కరీంనగర్ జోన్ లోనే 200 మంది పిల్లలు నాసా ప్రాజెక్టులలో పాల్గొంటున్నారని, అన్ని జోన్లలో కూడా చాలా ఉత్సాహంగా నాసాలో పాల్గొంటున్నారని, ఇలాంటి విద్యార్థులకు శ్రీ చైతన్య యాజమాన్యం ఎప్పటికీ తోడు ఉంటుందని తెలిపారు. పాఠశాల ప్రిన్సిపల్ న్యాలకొండ పద్మజా మాట్లాడతూ శాస్త్రీయపరంగా పిల్లలు వారి యొక్క మేధాశక్తిని ఉపయోగిస్తూ మరెన్నో ప్రాజెక్టులు చేస్తూ అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం ఎం రాజు, డీన్ విజయకృష్ణ, నాసా ఇంచార్జ్ చంద్రకళ, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.