12-06-2025 12:26:11 AM
నారాయణఖేడ్, జూన్ 11: ఈనెల 14న నారాయణఖేడ్ మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టులో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని నారాయణఖేడ్ ఎస్త్స్ర విద్యా చరణ్ రెడ్డి బుధవారం తెలిపారు. వాహనాలు చాలాన్లు, ఒప్పంద పరిష్కారాలు, చిన్న చిన్న కొట్లాటలకు సంబంధించిన కేసులను రాజీ మార్గానజాతీయ లోక్ అదాలతో పరిష్కరించుకోవచ్చని సూచించారు. లోక్ అదాలత్ లో పరిష్కారమైన వెంటనే న్యాయబద్ధమైన తీర్పులు ఇవ్వబడతాయని, ప్రజలు తమ సమయాన్ని, ఖర్చును ఆదాచేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. తమ కేసులకు సంబంధించిన వారు స్థానిక పోలీస్ స్టేషన్లో సంప్రదించలని సూచించారు.