పటాన్చెరు, ఏప్రిల్ 23 (విజయక్రాంతి) : శివంపేటలోని భగలాముఖి శక్తిపీఠాన్ని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు మంగళవారం దర్శించుకున్నారు. ఆలయ ట్రస్టు సభ్యులు నీలం మధును ఘనంగా సన్మానించగా ఎంపీ ఎన్నికల నేపథ్యంలో స్థానిక నాయకులతో కలిసి అమ్మవారిని దర్శించుకొని నీలం మధు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ అసెంబ్లీ ఇన్ఛార్జి రాజీరెడ్డి, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి పాల్గొన్నారు.