5 May, 2026 | 6:25 PM

Breaking News

అడవుల సంరక్షణలో సిబ్బంది కార్యోన్ముఖులు కావాలి: డీఎఫ్ఓ బాలమణి   •   ఆయిల్ ఫాం సాగుకు రైతులు ముందుకు రావాలి: కలెక్టర్ హరిత   •   పండుగలు వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి   •   రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని కేంద్రం తీసుకోవాలి   •   కొత్తరకం పంటలపై రైతాంగానికి అవగాహన కల్పిస్తాం   •   కొమ్ముగుడెంలో సిసి రోడ్లు ప్రారంభించిన సోయం వీరభద్రం   •   జనాభాగణాలపై ముగిసిన శిక్షణ   •   నవోదయకు విద్యార్థి ఎంపిక   •   గోవులను రక్షించే క్రమంలో చట్టాలను అతిక్రమించ వద్దు   •   అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో టీవీకే చీఫ్ జోసెఫ్ విజయ్ చిత్రపటానికి పాలాభిషేకం   •  

నెట్టెంపాడు ఫేజ్-1 పంపుల మొరాయింపు

07-08-2024 02:33 AM

ఆగిన ఎత్తిపోతల 

గద్వాల (వనపర్తి), ఆగస్టు 6 (విజయక్రాంతి): గద్వాల నియోజకవర్గంలోని అతి పెద్ద సాగునీటి ఎత్తిపోతల పథకం నెట్టెంపాడు ప్రాజెక్టు కింద ఉన్న ఫేజ్ -1లో సాంకేతిక సమస్యతో జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోసే పంపులు సోమవారం రాత్రి నుంచి ఆగిపోయాయి. పంపులకు అం దించే ముఖ్యమైన సర్క్యూట్‌లో స్టాటికల్ ఫ్రీక్వెన్సీ కంపోనెంట్ (ఎస్‌ఎఫ్‌సీ) సమస్య కారణంగా నీటి ఎత్తిపోసే పంపులు ఆగిపోయాయని సమాచారం.

ఈ సాంకేతిక సమస్యను నెట్టెంపాడు ప్రాజెక్టు కింద ఉన్న పంపులను బీహెచ్‌ఈఎల్ కంపెనీ మాత్రమే సరిదిద్దేందుకు అవకాశం ఉందని, అయితే ఆ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం రూ. కోటి 13 లక్షలు బాకి పడిందని.. ఇంతవరకు మెయింటెనెన్సు పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు చేసేందుకు  బీహెచ్‌ఈఎల్ ముందుకు రావడం లేదన్నది సమాచారం.