28-07-2025 12:00:00 AM
కామారెడ్డి అర్బన్, జూలై 27 ః కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవుని పల్లి గ్రామ రైతు సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా శివాజీ, ఉపాధ్యక్షులుగా సతీష్, కోశాధికారిగా రమేష్, సలహాదారులుగా రంజిత్, నవీన్, ఈశ్వర్, కార్యవర్గ సభ్యులుగా కాసర్ల శ్రీకాంత్, మస్కూరి రమేష్, బండారి బైరయ్య, శ్రీకాంత్, రఘు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.