15 May, 2026 | 3:03 PM

Breaking News

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన కాంగ్రెస్ నేతలు   •   మంత్రి తుమ్మలను కలిసిన కల్లూరు, సత్తుపల్లి ఆర్యవైశ్య నాయకులు   •   సత్తుపల్లిలో నల్లమోతు శ్రీనివాస రావు కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి తుమ్మల   •   తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం.. కమిటీ ఏర్పాటు   •   Fuel Price Hike: ‘మోదీ తప్పుకు ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారు’: కేంద్రంపై రాహుల్ విమర్శలు   •   ఫిల్మ్ ఛాంబర్‌లో కీలక సమావేశం   •   ఐదు దేశాల పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ   •   చెరువులు వాగుల వద్ద జాగ్రత్తగా ఉండండి   •   నేరాల నియంత్రణకు అందరూ సహకరించాలి: సీఐ ధనుంజయ్ గౌడ్   •   ఇక OMR పత్రాలు ఉండవు: ఆన్‌లైన్‌లోనే NEET పరీక్ష   •  

ఆస్పత్రి తనకిలో విస్తుపోయిన అదనపు కలెక్టర్..!

30-07-2025 09:12 AM
  1. ఆరోగ్య కేంద్రంలో అన్ని కాలీ కుర్చీలే దర్శనం.
  2. వైద్యాధికారికి మెమో జారీ చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశం 

నాగర్ కర్నూల్(విజయక్రాంతి): సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులంతా అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. కానీ తెలకపల్లి మండల పీహెచ్సీ కేంద్రంలో సిబ్బంది అంతా ఒకేరోజు డుమ్మా కొట్టడంతో మంగళవారం  జిల్లా అదనపు కలెక్టర్ అమరేందర్(District Additional Collector Amarender) తనిఖీ చేసిన సమయంలో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది.  తనిఖీ చేసిన సమయంలో వైద్యాధికారితో పాటు స్టాఫ్ నర్స్ ఇతర సిబ్బంది ఎవరూ రోగులకు అందుబాటులో లేకపోవడంతో అగ్రహానికి లోనయ్యారు. ఆ సమయంలో ఆయుషు డాక్టర్ భానుచందర్ మరో ఏఎన్ఎం మాత్రమే అందుబాటులో ఉన్నారు. దీంతో జిల్లా వైద్యాధికారిని స్వరాజ్యలక్ష్మికి ఫోన్ లో మాట్లాడి ఆసుపత్రికి డుమ్మా కొట్టిన వైద్యురాలు, సిబ్బందికి మెమో జారీ చేయాలని ఆదేశించారు. కానీ పర్యవేక్షణ చేయాల్సిన అధికారులే ఫోన్ లో లీవ్ అడిగారంటూ సదరు డాక్టర్, సిబ్బందిని వెనకేసుకు రావడం విశేషం. దీంతో ఏమీ చేయలేక వెనుదిరిగి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.  తాడూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మరో అదనపు కలెక్టర్ దేవ సహాయం ఆకస్మికంగా సందర్శించారు.